Dussehra Special Trains | తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు శుభవార్త. నేటి నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది భారతీయ రైల్వే. దసరా, దీపావళి సందర్భంగా ఈ రైళ్లను నడుపుతోంది. కొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల నుంచి వెళ్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నడిచే ప్రత్యేక రైళ్ల వివరాలు, రూట్స్, టైమింగ్స్ తెలుసుకోండి.
భారతీయ రైల్వే దసరా, దీపావళి పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వేర్వేరు జోన్లలో 39 స్పెషల్ ట్రైన్స్ నడపుతోంది. వీటిలో ఏసీ ఎక్స్ప్రెస్, దురంతో, రాజధాని, శతాబ్ధి లాంటి రైళ్లు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
పండుగ సీజన్ సందర్భంగా 200 రైళ్లను నడుపుతామని రైల్వే బోర్డ్ ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా 39 రైళ్ల జాబితాను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
దసరా, దీపావళి సందర్భంగా భారతీయ రైల్వే నడిపే 39 ప్రత్యేక రైళ్లలో తెలుగు రాష్ట్రాల్లో తిరిగే రైళ్లు కూడా ఉన్నాయి. ఆ రైళ్ల జాబితా, రూట్లు, టైమింగ్స్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆ వివరాలు తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)

రైలు నెంబర్ 02707 విశాఖపట్నం నుంచి తిరుపతికి వారంలో మూడు రోజులు రైలు నడుస్తుంది. అక్టోబర్ 15 నుంచి ప్రతీ గురువారం, శనివారం, సోమవారం రాత్రి 10.25 గంటలకు విశాఖపట్నంలో రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11.35 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. దారిలో దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 02775 కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వరకు వారంలో మూడు రోజులు ప్రయాణిస్తుంది. 2020 అక్టోబర్ 25 నుంచి ప్రతీ మంగళవారం, గురువారం, శనివారం రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. ఈ రైలు దారిలో రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుంది. (Source: South Indian Railways)
రైలు నెంబర్ 02776 లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్కు వారంలో మూడు రోజులు ప్రయాణిస్తుంది. 2020 అక్టోబర్ 26 నుంచి ప్రతీ సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 7.55 గంటలకు లింగంపల్లిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.15 గంటలకు కాకినాడ టౌన్ చేరుకోనుంది. ఈ రైలు దారిలో బేగంపేట్, సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)