ఏపీ తెలంగాణ సీఎంల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం కారణంగా వారి మధ్య దూరం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయమై ఇద్దరు నేతల మధ్య దూరం పెరిగింది. పిలిచి భోజనం పెడితే అంటూ.. జగన్పై కేసీఆర్ తీవ్ర వాఖ్యలు చేశారు. దీనికి బదులుగా జగన్ స్పందిస్తూ.. పోతిరెడ్డిపాడు పాతదే.. పాలమూరే కొత్తదంటూ కేసీఆర్కు సమాధానం ఇచ్చారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో లేని అభ్యంతరం.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై ఎందుకంటూ జగన్ కేంద్రంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ కృష్ణా ట్రైబ్యునల్ కేటాయింపుల మేరకే చేపడుతున్నామని జగన్ చెప్పినట్లు సమాచారం. తెలంగాణతో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నామన్న జగన్.. కానీ రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ భేటీలో మన వాదనను బలంగా వినిపిద్దామని అధికారులకు చెప్పారు.